Sunday 17 March 2013


'బి-థర్మల్‌' విద్యుత్‌ కేంద్రం విస్తరణ డిమాండ్‌
అఖిల పక్ష నేతల 72 గంటల నిరాహార దీక్ష

బీ-థర్మల్‌ విద్యుత్‌ కేంద్ర విస్తరణ కోరుతూ అఖిలపక్ష పోరాట సమితి ఆధ్వర్యంలో స్థానిక బి పవర్‌హౌజ్‌ బైపాస్‌ రోడ్డు రాజీవ్‌ రహదారి పక్కన 72గంటల నిరవధిక నిరాహార దీక్షను చేపట్టారు. ఈ దీక్షలో టీఆర్‌ఎస్‌, టీడీపీ, సీపీఐఎంఎల్‌ న్యూడెమాక్రసీ, సీపీఐ, సీపీఎం, బీజేపీ, వైసీపీ, కాంగ్రేస్‌కు చెందిన కన్వినర్‌ కన్నూరి సతీష్‌కుమార్‌, లగిశెట్టి భీమన్న, తూళ్ల రాజేశ్‌, ఎండి.సాజిద్‌, పర్కాల లక్ష్మణ్‌, గీట్ల లక్ష్మారెడ్డి, కొమ్ము రాజమల్లు యాదవ్‌, బొడ్డుపల్లి శ్రీనివాస్‌, మార్త రామన్న, మోసం సదా, దూలం సతీశ్‌, నంది నారాయణ, ఉమా మహేశ్వర్‌, పెండ్యాల సతీశ్‌, వేల్పుల రవీందర్‌, షేక్‌ అఫ్జల్‌ పాషా, హీరాసింగ్‌లు కూర్చోగా, ముఖ్యఅతిథులుగా హాజరై జెన్‌కో ఎస్‌ఈ నర్సింహారావు, నాయకులు కోడిపుంజుల రాజన్న, మాతంగి శ్రీనివాస్‌, బొడకుంట జనార్ధన్‌, కొంకటి లక్ష్మినారాయణ, మాతంగి నర్సయ్య, ఉరిమెట్ల రాజలింగం, బుర్ర తిరుపతి, ఎం.రామాచారి, ఆవుల గోపాల్‌యాదవ్‌, నరేష్‌, గోపు అయిలయ్య యాదవ్‌, దీటి బాలరాజు, హైమద్‌ బాబు, పద్మనాభరావులు పూలమాల వేసి దీక్షను ప్రారంభించారు. కాగా వివిధ సంఘాల, పార్టీల నాయకులు, స్థానికులు వీరికి సంఘీభావం తెలిపారు. గతంలో 'రామగుండం టుడే' బ్లాగ్‌లో రామగుండం బి-థర్మల్‌ విస్తరణపై ప్రత్యేక వ్యాసాన్ని పోస్ట్‌ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన వివరాల కోసం ఓల్డ్‌ పోస్ట్‌లను చదవండి.