Saturday 24 January 2015

పోచమ్మ గుడి మైదానంలో మహాధర్నా

గోదావరిఖని ప్రధాన చౌరస్తా సమీపంలోని పోచమ్మ గుడి మైదానం కబ్జాదారుల చేతుల్లోకి వెళ్లకుండా కాపాడాలనే డిమాండ్ తో రెండు రోజులు మహాధర్నా నిర్వహించారు ఈకార్యక్రమంలో కార్పోరేటరలు వివిధ పార్టీల సంఘాల నాయకులు వందలాదిగా ప్రజలు పాల్గొన్నారు

Monday 19 January 2015

తెలంగాణ 42, 43 ప్రజాసమితి గేట్ మీటింగ్

మేడిపల్లి ఓసిపి గనిలో తెలంగాణ 42, 43 ప్రజాసమితి  సమావేశం సోమవారం నిర్వహించారు
కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు
ఈనెల 21న లేబర్ కమీషనర్ తో జరిగే చర్చల్లో సింగరేణి అన్ని డివిజన్ల జీఎం లు పాల్గొని కార్మికుల సమస్యలు ప్రస్తావించాలని కోరారు

Saturday 17 January 2015

పోలియో చుక్కలు వేయించండి

తేది 18 - 20వ తేదీ వరకు ఐదు ఏళ్ళ లోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించ గలరు

సింగరేణి C&MDని కలిసిన పలు సంఘాలు

సింగరేణి సిఎండిగా బాధ్యతలు స్వీకరించిన శ్రీధర్ తొలిసారి రామగుండం ఏరియాలో పర్యటింటిన సందర్భంగా ఆయన్ను బిసి ఉద్యోగుల సంక్షేమ సంఘం నాయకులు మరియు హెచ్ ఎంఎస్ నాయకులు వేర్వేరుగా ఆయన్ను కలిసి అభినందనలు తెలిపారు సంస్థ అభివ్రుద్ధికి 33 వేల మంది బీసీ ఉద్యోగులు సహకారం అందిస్తారన్నారు
నాయకులు పి టి స్వామి కామని రాజేశం   హెచ్ఎమ్మెస్ నాయకులు దేవ వెంకటేశం యాదగిరి సత్తయ్య  తదితరులు పాల్గొన్నారు


Friday 16 January 2015

సంక్రాంతి ప్రాముఖ్యత

మకర సంక్రమణం లేదా మకర సంక్రాంతి పండుగ హిందువులకు అతి ప్రాముఖ్యమైన పండుగలలో ఒకటి. మకర సంక్రమణం లేదా మకర సంక్రాంతి పండుగ హిందువులకు అతి ప్రాముఖ్యమైన పండుగలలో ఒకటి.సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన సందర్భంగా మకర సంక్రాంతి జరుపుకోవడం మన ఆచారంగా అనాదికాలంగా వస్తోంది. ధనుర్మాసం ఆఖరి రోజు "భోగి" పండుగ. అప్పటివరకూ సూర్యుడు ధనూరాశిలో సంచరించి సంక్రాంతి రోజున మకరరాశిలోకి ప్రవేశిస్తాడు. మకర సంక్రాంతి నుండి ఉత్తరాయణ ప్రారంభమౌతుందని భారతీయుల నమ్మకం. ఈ పండుగ రోజుల్లో పూజలూ, పిండివంటలూ, పతంగులూ మాత్రమే కాకుండా సరదాగా ఈ పండుగ వెనుక ఉన్న విజ్ఞానాన్ని ఒకసారి గుర్తు చేసుకుందాం. త్తరాయణం అంటే "ఉత్తర దిశలో ప్రయాణం" అని అర్థం. అంటే సూర్యుడు దక్షిణం వైపుకు ఒకసారి (అరునెలలు పాటు), ఉత్తరం వైపు ఒకసారి (ఆరు నెలలు) ప్రయాణిస్తాడు. అది అందరికీ తెలిసిందే. అందులో, ఉత్తరదిశలో ప్రయాణించే కాలాన్ని "ఉత్తరాయణం"గా, దక్షిణదిశలో ప్రయాణించే "దక్షిణాయణం"గా వ్యవహరిస్తున్నాం. "మకర సంక్రమణం" అంటే మకర రాశిలోకి ప్రవేశించడం. అయితే, సూర్యుని ఉత్తర దిశా గమనం, మకర సంక్రాంతి కన్నా 25(సుమారు) రోజులు ముందే మొదలైపోతుంది. అంటే "ఉత్తరాయణం" ముందే ప్రారంభమైనట్టు. డిసెంబర్‌ 21/22 న సూర్యుడు మకరరేఖ (అంటే దక్షిణార్థ గోళంలో) ఉంటాడు. ఆరు నెలల తర్వాత అంటే జూన్‌ 20/21న కర్కాటకరేఖ (అంటే ఉత్తరార్థ గోళం)పైకి వస్తాడు. అంటే ఉత్తరంగా ప్రయాణించినట్టేగా. అదే ఉత్తరాయణం. అలాగే మరో ఆరు నెలలు తిరిగేసరికి అంటే డిసెంబర్‌ 21/22కి మకరరేఖ పైకి వెళ్తాడు. అంటే దక్షిణంగా ప్రయాణించినట్టు., అది దక్షిణాయణం. సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించడం అనేది ఒక కొండ గుర్తు మాత్రమే. నిజానికి ఉత్తరాయణం ఇంకా ముందే మొదలైపోతుంది. (తిలక్‌ ఆర్యవలస సిద్ధాంతాన్ని సమర్ధించిన విధంగా చూస్తే, ఉత్తర ధృవం వద్ద పగలు ప్రారంభమయ్యేది కూడా ఉత్తరాయణంలోనే అంటే డిసెంబర్‌ 20/21 తర్వాతనే) ప్రతీ యేడాదీ., సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించడానికీ, ఉత్తరాయణం ప్రారంభం కావడానికీ మధ్యలో 50 సెకండ్ల తేడా పెరుగుతోదని, ఇప్పటి పరిశీలన. మన జ్యోతిష్కులు వీటిని కూడా పరిగణలోకి తీసుకుంటారు(ట). అందుకే సంక్రాంతి, ప్రతీ 80 సంవత్సరాలకోసారి ఒకరోజు వాయిదా వేయబడుతూ వస్తోంది. ఆర్యభట్టుని సూర్య సిద్ధాంతం ప్రకారం ఉత్తరాయణ ప్రారంభానికీ(డిసెంబర్‌ 21/22), సూర్యుడు మకరరాశిలో ప్రవేశించడానికి మధ్యన ఉండే వ్యవధి గరిష్టంగా 27కి చేరి, ఆ తర్వాత తగ్గింపబడుతుంది (లేదా తగ్గిపోతుంది). ఈ లెక్క ప్రకారం 2294 సంవత్సరం తర్వాత మకర సంక్రాంతి ముందుకి జరుగుతూ వస్తుంది (80 ఏళ్లకోసారి). కానీ ఇప్పటి ఆధునిక విజ్ఞానవేత్తల ఉద్దేశ్యం, అది అలా పెరుగుతూనే ఉంటుందని. సంక్రాంతికి ముందు రోజు అంటే భోగి రోజున మంటలు ఎందుకు వేస్తారు అనేదానిక్కూడా ఇక్కడే సమాధానం వెతుక్కోవచ్చు. ఉత్తరాయణ ప్రారంభం అయ్యే రోజుగానీ, ఆ ముందు రోజుగానీ, మొత్తం సంవత్సరంలో రాత్రిభాగం ఎక్కువగా ఉండే రోజు అవ్వడం వల్లన మంటలు వేసి పండగ మొదలుపెట్టడం వచ్చి ఉండచ్చు. అయితే, ముందు చెప్పినట్టు ఉత్తరాయణ ప్రారంభం డిసెంబర్‌ 21/22 అవ్వడం వల్ల, సంక్రాంతి ఎక్కువ రాత్రి భాగం ఉందే రోజు అవ్వదు. ఇప్పుడంటే, డిసెంబర్‌ 21/22 అని ఉత్తరాయణ ప్రారంభం(Winter solistice) గురించి సులువుగా చెప్పేస్తున్నాంగానీ, 200 సంవత్సరాల క్రితం సరిగ్గా చెప్పే విధానం జనంలో వాడుకలో లేదు కదా. మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించడం అంటే ఖచ్ఛితంగా ఉత్తరాయణం మొదలైపోయిందని నిర్ధారించేసుకోవచ్చు కనక, మకర సంక్రమణం వరకూ ఆగి, అప్పుడు పండగ మొదలుపెట్టి ఉండవచ్చు.  

జనగామలో ఉచిత వైద్యశిబిరం

కార్పోరేషన్ పదవ వార్డు జనగామలో ఎల్ఆసి ఆద్వర్యంలో 200 మందికి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు
బిజెపి కార్పోరేటర్ జనగామ నర్సయ్య తదితరులు పాల్గొన్నారు

Rangoli

ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో కాకతీయనగర్ లో ముగ్గుల పోటీలు

Thursday 15 January 2015